పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-808-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! యట్టి రిక్థహారులు గేహకో
శాను జీవ యుతులు యిన యట్టి
నందనాదులందుఁ జెందిన మమత ని
ద్ధుఁడయ్యె నంతఁ బార్థివుండు.

టీకా:

అనఘ = పుణ్యుడ; అట్టి = అటువంటి; రిక్థహారులు = ఆస్తిపంచుకొనెడివారు; గేహ = గృహములు; కోశ = సంపదలు; అనుజీవయుతులు = ఆశ్రయించి జీవించువారు; అయిన = అయిన; అట్టి = అట్టి; నందన = పుత్రులు; ఆదులు = మొదలగువారు; అందున్ = ఎడల; చెందిన = చెందినట్టి; మమతన్ = నాది అనెడి అభిమానమున; నిబద్ధుడు = బంధింపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; పార్థివుండున్ = రాజు {పార్థివుడు - పృథివికి సంబంధించినవాడు, రాజు};

భావము:

పుణ్యాత్మా! అతని కొడుకులు, మనుమలు ఆస్థి పంచుకొనేవారై ఇంటిలో ఉన్న ధనంమీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అయినా వారి మీద పురంజనుడు మమత పెంచుకున్నాడు.