పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-807-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను తత్సుతు లొక్కకనికి
యముఁ బాంచాల దేశమందులఁ బౌరం
కులవర్ధను లగుచున్
నియించిరి నూర్వురేసి శౌర్య బలాఢ్యుల్

టీకా:

విను = వినుము; తత్ = ఆ; సుతులున్ = పుత్రులు; ఒక్కొక్కనికిన్ = ఒక్కొక్కరికి; అనయమున్ = ఎల్లప్పుడు; పాంచాల = పాంచాల; దేశము = దేశములు; అందులన్ = అందులోని; పౌరంజన = పురంజనుని; కుల = వంశమును; వర్థనులు = ఉద్దరించెడివారు; అగుచున్ = అవుతూ; = = జనియించిరి = పుట్టిరి; నూర్వురు = వందమంది (100); ఏసి = చొప్పున; శౌర్య = వీరత్వము; బల = శక్తి; ఆఢ్యులు = సమృద్ధిగా కలవారు.

భావము:

విను. ఆ పురంజనుని కొడుకులకు ఒక్కొక్కనికి నూరుగురేసి కొడుకులు జన్మించారు. వారంతా మహాశూరులు. వారివల్ల పాంచాల దేశంలో పురంజనుని వంశం వర్ధిల్లింది.