పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-776-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత స్వకీయ ప్రాణవల్లభ యగు మహిషియందు మనంబు నునిచి నా వరారోహయు గృహమేధినియు నయిన గృహిణిం గానక, విమనస్కుండై నిజాంతఃపుర కామినులం గనుంగొని యిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; స్వకీయ = తన యొక్క; ప్రాణవల్లభ = ప్రియభార్య; అగు = అయిన; మహిషి = పట్టపురాణి; అందున్ = ఎడల; మనంబున్ = మనసు; ఉనిచినన్ = పెట్టిన; ఆ = ఆ; వరారోహయున్ = ఉత్తమ స్త్రీ {వరారోహ - గొప్ప పిరుదులు గలామె, ఉత్తమస్త్రీ}; గృహమేధినియున్ = ఇంటి యజమానురాలు; అయిన = అయిన; గృహిణిన్ = ఇల్లాలు; కానక = కనిపించక; విమనస్కుండు = దిగాలు పడిన మనసు కలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; అంతఃపుర = పురము లోపల ఉండెడి; కామినులన్ = స్త్రీలను {కామిని - కోరదగినామె, స్త్రీ}; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

రాణిపై మనస్సు నిలిపాడు. కాని రాణి కనిపించలేదు. అందుచేత మనస్సు కలత చెందగా అంతఃపురంలోని స్త్రీలను చూచి ఇలా అన్నాడు.