పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-770-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున నతండు మహిషీ విప్రలబ్ధుండును వంచిత స్వభావుండును నై పారవశ్యంబునంజేసి యజ్ఞుండును నితరేచ్ఛా విరహితుండును నై క్రీడామృగంబు చాడ్పున వర్తించుచు నా పురంబునఁ గాపురంబుండఁ గొన్ని దినంబుల కా పురంజనుం డొకానొక దినంబున ధనుర్ధరుండై.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగా; అతండు = అతడు; మహిషి = పట్టపురాణిచేత; విప్రలబ్ధుండును = మిక్కిలి మోసగింపబడిన వాడు; వంచిత = మోసగించెడి; స్వభావుండును = స్వభావము కలవాడును; ఐ = అయ్యి; పారవశ్యంబునన్ = పరవశత; చేసి = వలన; అజ్ఞుండును = తెలివిలేని వాడును; ఇతర = మరియొక; ఇచ్ఛా = కోరిక; విరహితుండును = లేనివాడును; ఐ = అయ్యి; క్రీడా = పెంపుడు; మృగంబున్ = జంతువు; చాడ్పునన్ = విధముగా; వర్తించుచున్ = తిరుగుతూ; ఆ = ఆ; పురంబునన్ = పురమునందు; కాపురంబున్ = కాపురము; ఉండన్ = ఉండగా; కొన్ని = కొన్ని; దినంబుల్ = దినముల; కున్ = కి; ఆ = ఆ; పురంజనుండు = పురంజనుడు; ఒకానొక = ఒకానొక; దినంబునన్ = దినమున; ధనుర్ధరుండు = ధనుస్సు; ధరుండు = ధరించినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ విధంగా అతడు రాణి చేత మోసగింపబడి పరవశం చేత అజ్ఞానుడై, మరే ఇతర కోరిక లేనివాడై పెంపుడు జంతువు వలె ఆ పురంలో తిరుగుతూ నివసిస్తూ కొన్ని దినాలకు ధనుస్సును ధరించి….