పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-765-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాథుఁడు లోకభయం
గతి వర్తించు గ్రీష్మకాలము దోఁపం
ళ లహరీ మనోహర
హ్రాదిని సలిలమందు సియించెఁ దగన్.

టీకా:

నరనాథుడు = రాజు {నర నాథుడు - నరులకు నాథుడు (పాలించువాడు), రాజు}; లోక = లోకములకు; భయంకర = భయము గొలిపెడి; గతిన్ = విధముగ; వర్తించు = నడచెడి; గ్రీష్మ = వేసవి; కాలమున్ = కాలము; తోపన్ = తెలియుచుండగా; తరళ = చలిస్తున్న; లహరీ = అలలతో; మనోహర = అందమైన; వర = చక్కటి; హ్రాదినిన్ = సరసు నందలి; సలిలము = నీటి; అందున్ = లో; వసియించెన్ = నివసించెను; తగన్ = చక్కగా.

భావము:

అంతలో లోక భీకరమైన వేసవి కాలం వచ్చింది. పురంజనుడు తళతళ మెరుస్తున్న కెరటాలతో మనస్సుకు విందు చేస్తున్న ఏటినీటిలో ప్రవేశించాడు.