పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-763-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యీ గతిఁ బలికిన యా
జాక్షిఁ బురంజనుండు రియించి ముదం
బు నన్యోన్యప్రీతిం
రుచుఁ దత్పురము చొచ్చి న్యుం డగుచున్

టీకా:

అని = అని; ఈ = ఈ; గతిన్ = విధముగ; పలికిన = పలుకగా; ఆ = ఆ; వనజాక్షిన్ = స్త్రీని {వనజాక్షి - వనజము (పద్మముల వంటి) అక్షి (కన్ను గలామె), స్త్రీ}; పురంజనుండు = పురంజనుడు {పురంజనుడు - పురమున (దేహమున) వసించెడివాడు (ఉండెడివాడు), జీవుడు, ఆత్మ}; వరియించి = వరించి; ముదంబునన్ = సంతోషముతో; అన్యోన్య = ఒకరినొకరు; ప్రీతిన్ = ప్రేమ యందు; తనరుచున్ = అతిశయించుచున్; తత్ = ఆ; పురమున్ = పురమును; = చొచ్చి = ప్రవేశించి; ధన్యుండు = భాగ్యవంతుడు; అగుచున్ = అవుతూ.

భావము:

అని ఈ విధంగా పలికిన ఆ స్త్రీని పురంజనుడు వరించాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రీతి కలవారై ఆ పట్టణంలో ప్రవేశించారు.