పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-756-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యివ్విధంబున నధీరుండై పలుకు పురంజనుం జూచి యా ప్రమదోత్తమ వీరమోహితయై సస్మితానన యగుచు నానందంబునొంది యిట్లనియె.

టీకా:

అని = అని; ఇవ్విధంబునన్ = ఈ విధముగ; అధీరుండు = ధైర్యము లేనివాడు. చంచలుడు; ఐ = అయ్యి; పలుకు = పలికెడి; పురంజనున్ = పురంజనుని {పురంజనుడు - పురమున (దేహమున) వసించెడివాడు (ఉండెడివాడు), జీవుడు, ఆత్మ}; చూచి = చూసి; ఆ = ఆ; ప్రమద = స్త్రీలలో {ప్రమద - యౌవ్వనాది మదము గలామె, స్త్రీ}; ఉత్తమ = ఉత్తమురాలు; వీరమోహిత = మిక్కిలి మోహములో పడినది; ఐ = అయ్యి; సస్మిత = నవ్వు కలిగిన; ఆనన = మోము కలిగినది; అగుచున్ = అగుచూ; ఆనందంబున్ = ఆనందమును; ఒంది = పొంది; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోయి పలుకుతున్న వీరుడైన పురంజనుని చూచి, వలచి, చిరునవ్వు చిందిస్తూ ఆమె ఇలా అన్నది.