పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-750-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీయ పురస్సరుఁ డగు
నాశనుఁ డెవ్వఁ? డతికృపామతి నాకున్
విరింపు" మనుచు వెండియు
ళేక్షణఁ జూచి ధరణివుఁ డిట్లనియెన్.

టీకా:

భవదీయ = నీ యొక్క; పురస్సరుడు = ముందు నడచెడివాడు; అగు = అయిన; పవనాశనుడున్ = పాము {పవనాశుడు - పవనము (గాలి)ని అశనుడు (తినువాడు), పాము}; ఎవ్వడు = ఎవడు; అతి = మిక్కిలి; కృపా = దయా; మతిన్ = భావముతో; నాకున్ = నాకు; వివరింపుము = వివరముగా తెలుపుము; అనుచున్ = అంటూ; వెండియున్ = ఇంకను; ధవళేక్షణన్ = స్త్రీని {ధవళేక్షణ - ధవళ (తెల్లని, స్వచ్ఛమైన) ఈక్షణ (చూపులు ఉన్నామె), స్త్రీ}; చూచి = చూసి; ధరణిధవుడున్ = రాజు {ధరణిధవుడు - ధరణి (భూమి)కి ధవుడు (భర్త), రాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

నీ ముందు నడుస్తున్న ఈ పాము ఎవ్వరు? నాకు దయతో వివరించు” అని రాజు మళ్ళీ ఇలా అన్నాడు.