పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-749-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఎవ్వరి దానవు? జనకుం
డెవ్వఁడు? పేరేమి? భృత్యు లీ పదియొక రిం
దెవ్వరు? సతు లెవ్వరు? మఱి
యివ్వనమున నుండఁ గార్యమెద్ది? మృగాక్షీ!

టీకా:

ఎవ్వరి = ఎవరికి చెందిన; దానవు = దానివి; జనకుండు = తండ్రి; ఎవ్వడు = ఎవడు; పేరు = పేరు; ఏమి = ఏమిటి; భృత్యుల్ = సేవకులు; ఈ = ఈ; పదియొకరు = పదకొండుమంది; ఇందు = వీరు; ఎవ్వరు = ఎవరు; సతులు = చెలికత్తెలు; ఎవ్వరు = ఎవరు; మఱి = మరింక; ఈ = ఈ; వనమునన్ = అడవిలో; ఉండన్ = ఉండుటకు; కార్యమున్ = కారణము, పని; ఎద్ది = ఏమిటి; మృగాక్షీ = స్త్రీ {మృగాక్షీ - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ}.

భావము:

“మృగనయనా! నీవు ఎవ్వరి దానవు? నీ తండ్రి ఎవరు? నీ పేరేమిటి? ఈ పది మంది సేవకులు ఎవరు? ఈ స్త్రీలు ఎవ్వరు? ఈ అడవిలో ఎందుకున్నవు?