పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని యఙ్ఞకర్మములు

  •  
  •  
  •  

4-522-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రమ్మఱ నత్రిచేఁ దెలుపఁగాఁబడి వైన్యతనూభవుండు రో
మ్మునఁ దోఁకఁ ద్రొక్కిన భుజంగమపుంగవుఁ బోలి యుగ్రుఁడై
మ్మరిఁబోసినం గని సురాధిపుఁ డెప్పటి యట్లఁ బాఱె న
శ్వమ్మును రూపమున్ విడిచి చాలఁ దిరోహితుఁడై రయంబునన్.

టీకా:

క్రమ్మఱన్ = మరల; అత్రి = అత్రి; చేన్ = చేత; తెలుపగాబడి = తెలుపబడి; వైన్య = పృథువు; తనూభవుండు = పుత్రుడు; రోషమునన్ = రోషముతో; తోకన్ = తోకను; తొక్కిన = తొక్కిన; భుజంగమ = సర్ప; పుంగవున్ = శ్రేష్ఠము; పోలి = వలె; ఉగ్రుడు = క్రోధము కలవాడు; ఐ = అయ్యి; అమ్మున్ = బాణమును; అరిన్ = వింటిమధ్యభాగమున; పోసినన్ = సంధించగా; కని = చూసి; సురాధిపుడు = ఇంద్రుడు {సురాధిపుడు - సురలు (దేవతల)కి అదిపతి, ఇంద్రుడు}; ఎప్పటియట్ల = ఎప్పట్లాగే; పాఱెన్ = పారిపోయెను; అశ్వమ్మునున్ = గుఱ్ఱమును; రూపమున్ = (మాయా) స్వరూపమును; విడిచి = వదిలేసి; చాలన్ = చలించిపోయి; తిరోహితుడు = మాయమైనపోయినవాడు; ఐ = అయ్యి; రయంబునన్ = వేగముగా.

భావము:

అత్రి మహర్షి రాజపుత్రుని మళ్ళీ పురికొల్పగా అతడు తోక త్రొక్కిన పామువలె కోపించి బాణాన్ని సంధించాడు. ఇంద్రుడు తన కపట రూపాన్ని, అశ్వాన్ని విడిచి మళ్ళీ అంతర్ధానమయ్యాడు.