పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని యఙ్ఞకర్మములు

  •  
  •  
  •  

4-521-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని పృథు భూవర తనయుఁడు
బలమునఁ జని కపాలట్వాంగము లో
లిని ధరియించి రయంబునఁ
ను నింద్రునిఁ గాంచి నొంపఁజాలక యంతన్.

టీకా:

విని = విని; పృథు = పృథువు అనెడి; భూవర = రాజు యొక్క; తనయుడు = పుత్రుడు; ఘన = అత్యధికమైన; బలమునన్ = బలముతో; చని = వెళ్ళి; కపాల = పుఱ్ఱెను; ఖట్వాంగముల్ =శివుని చేతిలో ఉండు గద వంటి ఆయుధము, మంచముకోడు; ఓలిన్ = అవశ్యము; ధరియించి = తాల్చి; రయంబునన్ = శ్రీఘ్రముగా; చనున్ = పోయెడి; ఇంద్రునిన్ = ఇంద్రునిని; కాంచి = చూసి; ఒంపన్ = చంప; చాలక = లేక; అంతన్ = అంతట.

భావము:

రాజపుత్రుడు జితాశ్వుడు ఇంద్రుని వెన్నంటాడు. కాని పుఱ్ఱెను, ఖట్వాంగాన్ని (శివుని చేతిలో ఉండే గద లాంటి ఆయుధము) ధరించి కపటవేషంలో ఉన్న ఇంద్రుణ్ణి చంపటానికి సందేహించాడు.