పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని యఙ్ఞకర్మములు

  •  
  •  
  •  

4-520-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱియును దేవతాపతి తమః పటలంబు జనింపఁ జేసి యె
వ్వరుఁ దనుఁ గానకుండ ననివారణఁ గాంచనపాశ బద్ధ మై
సురుచిరయూపదారు పరిశోభితమైన హయంబుఁ గొంచుఁ జె
చ్చె వినువీధి నేగఁగ ఋషిప్రవరుం డగు నత్రి చెప్పినన్.

టీకా:

మఱియునున్ = మరల; దేవతాపతి = ఇంద్రుడు; తమః = చీకటి; పటలంబున్ = తెరలను; జనింపన్ = కలుగ; చేసి = చేసి; ఎవ్వరున్ = ఎవరు కూడ; తనున్ = తనను; కానకుండన్ = చూడకుండ; అనివారణన్ = అడ్డులేక; కాంచన = బంగారు; పాశ = తాటిచే; బద్దము = కట్టబడినది; ఐ = అయ్యి; = సు = మంచి; రుచిర = అందమైన; యూపదారు = యూపస్తంభమున {యూపదారువు - యజ్ఞము నందు పశుబంధనార్థము నాటిన పైపట్టలేని కొయ్య (స్తంభము)}; పరి = మిక్కిలి; శోభితము = శోభిల్లుతున్నది; ఐన = అయిన; హయంబున్ = గుఱ్ఱమును; కొంచున్ = తీసుకుపోతూ; చెచ్చెర = వేగముగా; వినువీధిన్ = ఆకాశమార్గమున; ఏగగాన్ = వేళుతుండగ; ఋషి = ఋషులలో; ప్రవరుండు = శ్రేష్ఠుడు; అగు = అయిన; అత్రి = అత్రి; చెప్పినన్ = చెప్పగా.

భావము:

ఇంద్రుడు చిమ్మచీకటిని కల్పించి అదృశ్యరూపంలో మళ్ళీ వచ్చి బంగారు త్రాళ్ళతో కట్టివేసి ఉన్నయజ్ఞాశ్వాన్ని దొంగిలించి వేగంగా నింగివైపు వెళ్ళాడు. అది చూచి అత్రిమహర్షి చెప్పగా...