పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని యఙ్ఞకర్మములు

  •  
  •  
  •  

4-518-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీరుఁడు పృథు భూపాలకు
మారుఁడు నిజ యజ్ఞపశువు రలం గొని దు
ర్వాబలుఁ డగుచు జనకుని
భూరి సవనరాజపుణ్యభూమికి వచ్చెన్.

టీకా:

వీరుడు = శూరుడు; పృథు = పృథువు అనెడి; భూపాల = రాజు యొక్క; కుమారుడు = పుత్రుడు; నిజ = తమ; యజ్ఞపశువున్ = యజ్ఞపశువుని; మరలంగొని = వెనుకకు మరలించుకొని; దుర్వార = వారింపరాని; బలుడు = బలము కలవాడు; అగుచున్ = అవుతూ; జనకునిన్ = తండ్రి యొక్క; భూరి = అతి పెద్ద; సవన = యాగములలో; రాజ = శ్రేష్ఠముయొక్క; పుణ్య = పుణ్యవంతమైన; భూమి = ప్రదేశమున; కిన్ = కి; వచ్చెన్ = వచ్చెను.

భావము:

వీరుడైన పృథుకుమారుడు దుర్వార పరాక్రమంతో యజ్ఞపశువును మరలించుకొని పుణ్యభూమి అయిన జనకుని యాగశాలకు చేరుకున్నాడు.