పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-507-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారును భయవిరహితులై
బోనఁ దత్తన్నివాసముల యందు సుఖ
శ్రీరుచి నొప్పుచు నుండిరి
వాక యా పృథునిఁ బొగడ శమె ధరిత్రిన్?

టీకా:

వారును = వారుకూడ; భయ = భయములు; విరహితులు = ఏమి లేనివారు; ఐ = అయ్యి; బోరనన్ = శ్రీఘ్రమే; తత్తత్త = అయా; నివాసములు = జనవాసముల; అందున్ = లో; సుఖ = సుఖము; శ్రీ = సంపదలుతో; రుచిన్ = ప్రకాశించుతూ; ఒప్పుచున్ = చక్కగా; ఉండిరి = ఉండిర్; వారకన్ = అవశ్యము; ఆ = ఆ; పృథున్ = పృథుచక్రవర్తిని; పొగడన్ = స్తుతించుట; వశమే = సాధ్యమా ఏమి; ధరిత్రిన్ = భూమిపైన.

భావము:

ప్రజలు భయం తొలగి ఆయా నివాసాలలో సుఖసంపదలతో తులతూగుతూ బ్రతుకుతున్నారు. అటువంటి ధర్మమూర్తి అయిన పృథుచక్రవర్తిని కీర్తించడం ఈలోకంలో ఎవరికి శక్యం?