పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-499-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యివ్విధమున నా భూ
నితామణి పలుకు మధుర చనంబులు దా
విని యనురాగము దన మన
మునఁ గడలుకొనంగ రాజముఖ్యుం డంతన్.

టీకా:

అని = అని; ఈ = ఈ; విధమునన్ = విధముగ; ఆ = ఆ యొక్క; భూవనితామణి = భూదేవి {భూవనితామణి - భూమి అనెడి స్త్రీలలో మణి వంటి యామె, భూదేవి}; పలుకున్ = పలికిన; మధుర = తీయని; వచనంబులున్ = మాటలను; తాన్ = తను; విని = విని; అనురాగమున్ = కూరిమి; తన = తన యొక్క; మనమునన్ = మనసులో; కడలుకొనంగన్ = పొంగిపొర్లగా; రాజముఖ్యండు = మహారాజు; అంతన్ = అంతట.

భావము:

అని ఈ విధంగా భూదేవి పలికిన తియ్యని మాటలను పృథు చక్రవర్తి విని తన మనస్సులో ప్రేమ పొంగులెత్తగా…