పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-476-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి నన్నుఁ గృపామతి యెడలి యిటు వి
పాటనము చేసి త్రుంచెదు? ప్రజలు నీట
మునుఁగకుండంగ నే రీతి ఘచరిత!
రసి రక్షింతు” వన నతం వని కనియె.

టీకా:

ఇట్టి = ఇటువంటి; నన్నున్ = నన్ను; కృపా = దయగల; మతిన్ = మనసు; ఎడలి = వదలి; ఇటు = ఈ విధముగ; విపాటనము = చీల్చుట; చేసి = చేసి; త్రుంచెదవు = చెండాడెదవు; ప్రజలున్ = జనులను; నీటన్ = నీటిలో; మునుగకుండగన్ = మునిగిపోకుండా; ఏరీతిన్ = ఏ విధముగ; అనఘచరిత్ర = పుణ్యవర్తన; అరసి = పరికించి; రక్షింతువు = కాపాడెదవు; అనన్ = అనగా; అతండు = అతడు; అవని = భూదేవి; కిన్ = కి; అనియెన్ = పలికెను.

భావము:

ఇటువంటి నన్ను దయమాలి ఖండఖండాలు చేసి చంపుతానంటున్నావు. పుణ్యచరిత్రా! నామీద ఉన్న ప్రజలను నీటిలో మునిగిపోకుండా ఎలా కాపాడుతావు?” అని భూదేవి పలుకగా రాజు ఇలా అన్నాడు.