పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-381-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పాడె"ననుచు విదురున
ఘుఁడు మైత్రేయుఁ డనియె నంచిత భక్తిన్
వినుతోద్దామయశస్కుం
నఁగల యా ధ్రువుని చరిత మార్యస్తుత్యా!

టీకా:

అని = అని; పాడెన్ = పాడెను; అనుచున్ = అంటూ; విదురున్ = విదురుని; కిన్ = కి; అనఘుడు = పుణ్యుడు; మైత్రేయుడు = మైత్రెయుడు; అనియెన్ = పలికెను; అంచిత = చక్కటి; భక్తిన్ = భక్తితో; వినుత = స్తుతింపబడుట; ఉద్దామ = అతిశయించిన; యశస్కుండు = కీర్తి కలవాడు; అనన్ = అనుటకు; కల = తగిన; ఆ = ఆ; ధ్రువునిన్ = ధ్రువుని; చరితము = కథ; ఆర్యస్తుత్యా = గొప్పవారిచే కీర్తింపబడువాడ.

భావము:

ఇలా అంటూ విదురుడికి పుణ్యాత్ముడు అయిన మైత్రేయుడు గొప్ప కీర్తి కలవాడు అనదగిన ధ్రువుని వృత్తాంతం కీర్తించాడు మహానుభావ!