పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-370-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురము వెల్వడి చని పుణ్యభూ బదరికా-
న విశాలానదీలిత మంగ
ళాంబుపూరంబుల నురక్తిమైఁ గ్రుంకి-
మనీయ పరిశుద్ధ రణుఁ డగుచుఁ
ద్మాసనస్థుఁడై వనుని బంధించి-
నెలకొని ముకుళితనేత్రుఁ డగుచు
రిరూపవైభవ ధ్యానంబు చేయుచు-
గవంతు నచ్యుతుఁ ద్మనేత్రు

4-370.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందు సతతంబు నిశ్చలమైన యట్టి
క్తిఁ బ్రవహింపఁ జేయుచుఁ రమమోద
బాష్పధారాభిషిక్తుండు వ్యయశుఁడుఁ
బులకితాంగుండు నగుచు నిమ్ములఁ దనర్చి.

టీకా:

పురము = నగరము; వెల్వడి = బయల్పడి; చని = వెళ్ళి; పుణ్య = పుణ్యవంతమైన; భూ = భూమియైన; బదరికా = బదరికాశ్రమ సమీప; ఘన = గొప్ప; విశాలా = విశాల అనెడి; నదీ = నదిలో; కలిత = ఉన్న; మంగళ = శుభకరములైన; అంబుపూరంబులననున్ = నదీజలలో; రక్తిమై = ప్రీతిగా; క్రుంకి = స్నానముచేసి; కమనీయ = మనోహరమైన; పరిశుద్ధ = క్షాళనమైన; కరణుడు = ఇంద్రియములు కలవాడు; అగుచున్ = అవుతూ; పద్మాసనస్థుడు = పద్మాసనమునఉన్నవాడు; ఐ = అయ్యి; పవనుని = ప్రాణవాయువుని; బంధించి = బంధించి; నెలకొని = స్థిరుడై; ముకుళిత = మూసిన; నేత్రుడు = కన్నులు; అగుచున్ = అవుతూ; హరి = నారాయణుని; రూప = రూపము; వైభవ = వైభవములను; ధ్యానంబు = ధ్యానించుట; చేయుచున్ = చేస్తూ; భగవంతున్ = విష్ణుమూర్తి {భగవంతుడు - మహిమాన్వితుడు, విష్ణువు}; అచ్యుత = విష్ణుమూర్తి {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; పద్మనేత్రున్ = విష్ణుమూర్తి {పద్మనేత్రుడు - కలువలు వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; అందున్ = ఎడల.
సతతంబున్ = ఎడతెగని; నిశ్చలమైన = నిశ్చలమైన; అట్టి = అటువంటి; భక్తిన్ = భక్తి; ప్రవహింపన్ = ప్రవహించునట్లు; చేయుచున్ = చేస్తూ; పరమ = అత్యంత; మోద = సంతోష; బాష్ప = ఆశ్రువుల; ధారా = ధారలచే; అభిషిక్తుండు = అభిషేకింపబడినవాడు; భవ్య = దివ్యమైన; యశుండు = కీర్తికలవాడు; పులకిత = పులకరించిన; అంగుండు = అవయవములు కల వాడు; అగుచున్ = అవుతూ; ఇమ్ములన్ = కుతూహలముతో; తనర్చి = అతిశయించి.

భావము:

(విరక్తుడైన ధ్రువుడు) తన నగరంనుండి బయలుదేరి పుణ్యభూమి అయిన బదరికాశ్రమం వెళ్ళి, అక్కడి విశాల అనే పేరు కలిగిన పవిత్ర నదిలోని నీటిలో ప్రీతితో స్నానం చేసి, శుచియై పద్మాసనం కల్పించుకొని, వాయువును బంధించి, కనులు మూసికొని, భగవంతుని రూపాన్ని ధ్యానించాడు. ఆ విశాలయశోధనుడు ఆనందబాష్పాలతో తడిసిపోతూ మేను పులకించగా అచంచలమైన భక్తితో అచ్యుతుడు, కమలనేత్రుడు అయిన భగవంతుని ఆరాధించాడు.