పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-369-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను నిభుఁ డంత భృత్యజన మంత్రి పురోహిత బంధు మిత్ర నం
పశు విత్త రత్న వనితా గృహ రమ్యవిహార శైల వా
రినిధి పరీత భూతల హరిద్విప ముఖ్య పదార్థ జాలముల్
మతిచే ననిత్యములుగాఁ దలపోసి విరక్తచిత్తుఁడై.

టీకా:

మను = మనువులకు; నిభుడు = సమానమైనవాడు; అంత = అంత; భృత్యు = సేవకులు; జన = ప్రజలు; మంత్రి = మంత్రులు; పురోహిత = పురోహితులు; బంధు = బంధువులు; మిత్ర = మిత్రులు; నందన = పుత్రులు; పశు = పశువులు; విత్త = ధనము; రత్న = రత్నములు; వనితా = స్త్రీలు; గృహ = గృహములు; రమ్య = అందమైన; విహర = విహరింప దగిన ప్దలములు; శైల = పర్వతములు; వారినిధి = సముద్రము; పరీతభూతల = హద్దులుగా గల భూమి; హరి = గుఱ్ఱములు; ద్విప = ఏనుగులు; ముఖ్య = మొదలగు; పదార్థ = పదార్థముల; జాలముల్ = సమూహములు; ఘన = గొప్ప; మతిన్ = బుద్ధిచే; అనిత్యములు = అశాశ్వతములు; కాన్ = అగునట్లు; తలపోసి = అనుకొని; విరక్త = వైరాగ్యమునకు చెందిన; చిత్తుడు = చిత్తము కలవాడు; ఐ = అయ్యి.

భావము:

మనువులతో సమానుడైన ధ్రువుడు సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధువులు, మిత్రులు, పుత్రులు, పశువులు, ధనం, రత్నాలు, స్త్రీలు, భవనాలు, క్రీడా పర్వతాలు, సముద్ర పరివేష్ఠితమైన రాజ్యం, గుఱ్ఱాలు, ఏనుగులు మొదలైన పదార్థాలన్నీ తన బుద్ధికౌశలంతో అశాశ్వతాలని భావించి, విరక్తి చెంది…