పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-311.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాన ఘను నమ్మహాత్ముని గారవించె
సురుచి పూర్వంబు దలఁపక సుజనచరిత!
విష్ణుభక్తులు ధరను బవిత్రు లగుట
వారి కలుగరు ధరణి నెవ్వారు మఱియు.

టీకా:

కరము = అతిశయించి; ఒప్పన్ = చక్కనైన; ఆనంద = ఆనందమువలన; గద్గదము = బొంగురుపోయిన; స్వరమున = గొంతుకతో; జీవింపుము = జీవింపుము; అని = అని; ఆశీర్వదించె = ఆశీర్వదించెను; భగవంతుడు = విష్ణువు; ఎవ్వని = ఎవని; పై = పైన; మైత్రి = స్నేహము; పాటించున్ = చూపునో; సత్ = మంచి; కృప = దయ యొక్క; నిరతి = శ్రద్ధతో; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; అగుచున్ = అవుతూ; అతనికిన్ = అతనికి; తమయంతన = తమంతతామే; అనుకూలము = అనుకూలము; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; సర్వ = సమస్తమైన; భూతంబులు = జీవులును; సమతన్ = సమత్వము; పేర్చి = అతిశయించగ; మహిన్ = భూమిపైన; తలపోయ = ఆలోచించినచో; నిమ్న = పల్లపు; ప్రదేశముల్ = చోటి; కున్ = కి; అనయంబున్ = అవశ్యము; చేరు = చేరెడి; తోయములన్ = నీటి; పగిది = పగిదిన్; కాన = కావున.
ఘనున్ = గొప్పవానిని; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముని; గారవించె = గౌరవించెను; సురుచి = సురుచి; పూర్వంబున్ = పాత సంగతులు; తలపక = స్మరించక; సుజనచరిత = మంచివారి నడవడిక గలవాడ; విష్ణుభక్తులు = విష్ణుమూర్తి యొక్క భక్తులు; ధరనున్ = భూమికి; పవిత్రులు = పవిత్రమైనవారు; అగుటన్ = అవుటచేత; వారి = వారి; కిన్ = కి; అలుగరు = కోపించరు; ధరణిన్ = భూమిపైన; ఎవ్వారున్ = ఎవరుకూడ; మఱియు = ఇంకను.

భావము:

(సురుచి) ఆనందంతో వణుకుతున్న కంఠస్వరంతో “చిరంజీవ!” అని దీవించింది. పల్లమునకు నీళ్ళు ప్రవహించిన విధంగా భగవంతుని దయకు పాత్రుడైన వాని వద్దకు అందరూ తమంత తామే అనుకూల భావంతో చేరుకుంటారు. అందువల్లనే సురుచి గతాన్ని మరచిపోయి మహనీయుడైన ధ్రువుణ్ణి గౌరవించింది. నాయనా, విదురా! విష్ణుభక్తులు పరమపవిత్రులు. వారికి శత్రువులంటూ ఎవరూ ఉండరు. వారిపై ఎవ్వరూ కోపించరు.