పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-294-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునినాయక! విను కాముక
దుష్ప్రాపంబు విష్ణు రణాంబురుహా
ర్చ మునిజన సంప్రాప్యము
నఁగల పంకేరుహాక్షు వ్యయ పదమున్.

టీకా:

ముని = మునులకు; నాయక = నాయకుఢ; విను = వినుము; కాముక = కోరికలుగల; జన = వారిచే; దుష్ప్రాపంబున్ = పొందరానిది; విష్ణు = హరి; చరణ = పాదములు అనెడి; అంబురుహ = పద్మముల; అర్చన = పూజించెడి; ముని = మునులైన; జన = వారిచే; సంప్రాప్యమున్ = చక్కగ పొందబడునది; అనగల = అనగలిగిన; పంకేరుహాక్షు = విష్ణువు; అవ్యయ = తరుగనట్టి; పదమున్ = స్థానము.

భావము:

“మునీంద్రా! కాముకులకు పొందరానిది, విష్ణు భక్తులైన మునులు మాత్రమే పొందగలిగినది శాశ్వతమైన విష్ణుపదం కదా!