పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-292-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత ధ్రువుఁడునుఁ బంకేరుహాక్ష పాద
మల సేవోపపాదిత న మనోర
ములఁ దనరియుఁ దనదు చిత్తంబులోనఁ
దుష్టిఁ బొందక చనియె విశిష్టచరిత!"

టీకా:

అంత = అంతట; ధ్రువుడును = ధ్రువుడు; పంకేరుహాక్ష = హరి {పంకేరుహాక్షుడు - పంకేరుహము (నీటిలో పుట్టునది, పద్మము) వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల; సేవా = సేవించుటవలన; ఉపాదిత = పొందిన; ఘన = గొప్ప; మనోరథములన్ = కోరికలందు; తనరియున్ = అతిశయించియును; తనదు = తన యొక్క; చిత్తంబు = మనసు; లోనన్ = లో; తుష్టి = తృప్తి; పొందక = పొందలేక; చనియె = పోయెను; విశిష్టచరిత = అతిశ్రేష్ఠమైన వర్తన కలవాడ.

భావము:

అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన విష్ణువు యొక్క పాదపద్మాలను సేవించడం వల్ల సమధిక మనోరథాలు సంప్రాప్తించినప్పటికీ, సంతృప్తి పొందక చింతిస్తూ వెళ్ళిపోయాడు.