పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-267-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని నారదుండు పలికిన
విని మనమున విశ్వసించి విభుఁడును బ్రియ నం
నుఁ జింతించుచు నాదర
మునఁ జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్.

టీకా:

అని = అని; నారదుండు = నారదుడు; పలికిన = పలుకగా; విని = విని; మనమునన్ = మనసులో; విశ్వసించి = నమ్మి; విభుడును = రాజు; ప్రియ = ప్రియమైన; నందనున్ = పుత్రునికై; చింతించుచున్ = ఆలోచిస్తూ; ఆదరమునన్ = ఆదరముతో; చూడండు = చూడనివాడు; అయ్యెన్ = ఆయెను; రాజ్యమున్ = రాజ్యమును; పూజ్యముగన్ = శ్రద్ధగా.

భావము:

అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి, ప్రియపుత్రుని తలచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు.