పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-239-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున వివేకంబు గల పురుషుండు దనకుం బ్రాప్తంబు లగు సుఖ దుఃఖంబులు దైవవశంబులుగాఁ దలంచి తావన్మాత్రంబునం బరితుష్టుం డగు; నీవును దల్లి చెప్పిన యోగమార్గ ప్రకారంబున సర్వేశ్వరానుగ్రహంబుఁ బొందెద నంటివేని.

టీకా:

కావునన్ = అందుచేత; వివేకంబున్ = తెలివిడి; కల = కలిగిన; పురుషుండు = మానవుడు; తన = తన; కున్ = కు; ప్రాప్తంబులు = లభించినవి; అగు = అయిన; సుఖదుఃఖంబులు = సుఖదుఃఖంబులను; దైవ = దేవునికి; వశంబులు = వశమైనవి; కాన్ = అయినట్లు; తలంచి = అనుకొని; తావత్ = అంత; మాత్రంబునన్ = మాత్రముచేత; పరితుష్టుండు = సంతోషముకలవాడు; అగు = అవుతాడు; నీవునున్ = నీవుకూడ; తల్లి = తల్లి; చెప్పిన = చెప్పిన; యోగమార్గ = యోగమార్గము; ప్రకారంబునన్ = ప్రకారముగ; సర్వేశ్వర = విష్ణుమూర్తి; అనుగ్రహంబున్ = అనుగ్రహమును; పొందెదన్ = పొందుతాను; అంటివేని = అంటుంటే.

భావము:

కనుక తెలివి గల మానవుడు తనకు కలిగే సుఖదుఃఖాలను దైవసంకల్పం వల్ల కలిగినవని భావించి, వానితోనే తృప్తిపడతాడు. కాదు, నీవు నీ తల్లి చెప్పిన యోగమార్గాన్ని అనుసరించి భగవంతుని దయను పొందుతాను అన్నట్లయితే...