పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువోపాఖ్యానము

  •  
  •  
  •  

4-231-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిను నాడిన యా సురుచి వ
ములు సత్యంబు లగును; ర్వశరణ్యుం
నఁగల హరిచరణంబులు
ను జనకుని యంక మెక్కఁగాఁ దలఁతేనిన్.

టీకా:

నిను = నిన్ను; ఆడిన = అన్నట్టి; ఆ = ఆ; సురుచి = సురుచి; వచనములు = మాటలు; సత్యంబులు = నిజము; అగును = అవును; సర్వ = అందరికిని; శరణ్యుండు = శరణమిచ్చువాడు; అనగల = అనగలిగిన; హరి = హరి; చరణంబులు = పాదములు; కను = పొందుము; జనకుని = తండ్రి; అంకము = ఒడిని; ఎక్కగాన్ = ఎక్కనలెనని; తలతేనిన్ = తలుస్తే.

భావము:

నీ సవతి తల్లి సురుచి నీతో పలికిన మాటలు వాస్తవమే. నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశ ఉన్నట్లయితే అందరికీ దిక్కు అయిన హరిపాదాలను ఆరాధించు.