పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువోపాఖ్యానము

  •  
  •  
  •  

4-223-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రోదనంబు చేయుచుఁ
నుఁగవలను శోకబాష్ప ణములు దొరఁగన్
ని కడ కేగుటయు నిజ
యునిఁ గని యా సునీతి ద్దయుఁ బ్రేమన్.

టీకా:

ఘన = అధికమైన; రోదనంబుచేయుచూ = ఏడుస్తూ; కనుగవలను = కళ్ళ జంట వెంట; శోక = దుఃఖపు; బాష్ప = కన్నీటి; కణములు = బొట్లు; తొరగన్ = స్రవిస్తుండగా; జనని = తల్లి; కడకున్ = వద్దకు; ఏగుటయు = వెళ్లెను; నిజ = తన; తనయుని = పుత్రుని; కని = చూసి; ఈ = ఈ; సునీతియు = సునీతి; దద్దయున్ = మిక్కిలి; ప్రేమన్ = ప్రేమతో.

భావము:

బిగ్గరగా ఏడుస్తూ, కన్నులనుండి దుఃఖబాష్పాలు రాలుతూ ఉండగా కన్నతల్లిని సమీపించగా సునీతి కన్నకొడుకును చూచి మిక్కిలి ప్రేమతో....