పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

4-2-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యానవైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; “అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

టీకా:

మహనీయ = గొప్ప; గుణ = గుణములు గలవారిలో; గరిష్ఠులు = ఉత్తములు; అగు = అయినట్టి; ఆ = ఆ; ముని = యోగులలో; శ్రేష్ఠులు = గొప్పవారల, శౌనకాదుల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = సవివరముగ చెప్పు; వైఖరీ = నేర్పు; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయినట్టి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; ప్రాయోపవిష్టుండు = దేహము విడుచు దీక్షలోనున్నవాడు; ఐన = అయినట్టి; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రున్ = రాజున {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}; కున్ = కు; శుక = శుకుడు అనెడి; యోగీంద్రుడు = యోగులలో శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. "శుకమహర్షి ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నాడు.