పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతితో గ్రుమ్మరుట

  •  
  •  
  •  

3-821-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చి శుభమూర్తి యమ్ముని యశేష దిగీశ విహార యోగ్యమున్
సురుచిరమందగంధవహశోభితమున్ నికటప్రధాతు ని
ర్ఝసరిదంబు శీతలతుషారమునై తనరారు మేరుకం
మునకేగి దేవవనితాయుతుఁడైన కుబేరుచాడ్పునన్

టీకా:

చిర = మిక్కిలి; శుభ = శుభముల; మూర్తి = రూపము కలవాడు; ఆ = ఆ; ముని = ముని; అశేష = సమస్తమైన; దిక్ = దిక్కులకు; ఈశ = పతులకు; విహార = విహరించుటకు; యోగ్యమున్ = తగనదియును; సురుచిర = మనోఙ్ఞమైన; (సురు = చలిస్తూ; చిర = ఎక్కువ సమయము ఉండు;) మంద = పిల్ల;) గంధవహ = వాయువులచే; శోభితమున్ = శోభిల్లుతున్నదియును; నికట = సమీప మందలి; ప్రధాతు = చక్కటి ధాతువులతో కూడిన; నిర్ఝర = సెలయేటి; సరిత్ = ప్రవాహపు; అంబు = నీటి; శీతల = చల్లని; తుషారమున్ = తుంపరలు కలదియును; ఐ = అయ్యి; తనరారు = అతిశయించు; మేరు = మేరు; కంధరమున్ = పర్వతమున; కున్ = కు; ఏగి = వెళ్ళి; దేవ = దేవతా; వనితా = స్త్రీలతో; యుతుడు = కూడినవాడు; ఐన = అయినట్టి; కుబేరు = కుబేరుని; చాడ్పునన్ = విధముగ.

భావము:

నిత్యమంగళ స్వరూపుడైన ఆ కర్దముడు విమానారూఢుడై సమస్త దిక్పాలురు విహరించడానికి యోగ్యమైనదీ, మెల్లగా చల్లగా వీచే మలయమారుతాలతో కూడినదీ, సమీపంలో ప్రవహించే సెలయేళ్ళ నీటి తుంపురుల చల్లదనం కలదీ అయిన మేరుపర్వతం శిఖరాల మీద, నిత్యమంగళ స్వరూపుడైన ఆ కర్దముడు, సురసుందరీ సమేతుడైన కుబేరునిలా విహరించాడు.