పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-86-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యావులవలన రాజ్య
శ్రీదొలఁగెను ధర్మగతి నశించెను భువి మ
ర్యాలు దప్పె నధర్మో
త్పానమున దైత్యభేదిప్పినపిదపన్.

టీకా:

యాదవుల = యాదవుల; వలన = నుండి; రాజ్య = రాజ్యము అను; శ్రీ = సౌభాగ్యము; తొలగెన్ = తొలగిపోయినది; ధర్మ = ధర్మము యొక్క; గతి = ప్రవర్తన; నశించెను = నశించెను; భువిన్ = భూమిని; మర్యాదలు = కట్టుబాట్లు; తప్పెన్ = తప్పినవి; అధర్మ = అధర్మము; ఉత్పాదనమునన్ = పుట్టుటచే; దైత్యభేది = కృష్ణుడు {దైత్యభేది - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; తప్పిన = మరణించిన; పిదపన్ = తరువాత.

భావము:

దానవాంతకుడైన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట, యాదవల రాజ్య వైభవం మాయం అయిపోయింది. ధర్మమార్గం నశించింది. అధర్మం అతిశయించింది. లోకంలో మర్యాదలు లేకుండా పోయాయి.