పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-78-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిచెప్పి బాదరాయణి
నుజేంద్రునివలను సూచి ఱి యిట్లనియెన్
"విను మొకనాఁడీ యుద్ధవుఁ
యము నైదేండ్ల బాలుఁడై యున్నతఱిన్.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బాదరాయణుని (వ్యాసుని) పుత్రుడు, శుకుడు}; మనుజేంద్రుని = పరీక్షిత్తుని {మనుజేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు, పరీక్షిత్తు}; వలని = వైపు; చూచి = చూసి; మఱి = ఇంకనూ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; వినుము = విను; ఒకనాడు = ఒకరోజు; ఈ = ఈ; ఉద్ధవుడు = ఉద్ధవుడు; అనయమున్ = అవశ్యము; ఐదు = ఐదు; ఏండ్ల = సంవత్సరముల; బాలుడు = పిల్లవాడు; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; తఱిన్ = సమయమున.

భావము:

అని చెప్పి, శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు “పరీక్షిత్తు మహారాజా! విను. అప్పుడు తన చిన్నతనంలో ఈ ఉద్ధవుడు ఐదేండ్ల బాలుడుగా ఉన్న సమయంలో....