పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-77-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుకులనిధియగు కృష్ణుని
జలజవియోగతాపరమున మాటల్
ప్రిదులక హృదయంబెరియఁగఁ
బెవులుదడుపుచును వగలఁ బెంపఱియుండెన్."

టీకా:

యదు = యాదవ; కుల = వంశమునకు; నిధి = నిధి వంటి వాడు; అగు = అయిన; కృష్ణుని = కృష్ణుని; పద = పాదములను; జలజ = పద్మముల {జలజ - జలమున పుట్టినది, పద్మము}; వియోగ = ఎడబాటువలని; తాప = బాధ యొక్క; భరమునన్ = భారముచేత; మాటల్ = మాటలు; ప్రిదులక = పెగలక; హృదయంబు = హృదయములో; ఎరియగ = బాధపడగ, పరితపింపగ; పెదవులున్ = పెదవులు; తడపుచును = తడుపుకొనుచు; వగలన్ = దుఃఖము; పెంపఱి = అతిశయించి; ఉండెన్ = ఉండెను.

భావము:

అప్పుడు యాదవకులానికి పెన్నిధి అయిన కృష్ణుని పాదపద్మాలకు, దూరమైన కారణంగా ఉద్ధవునికి దుఃఖం పొంగి వచ్చింది. నోటమాట రాలేదు. గుండె పగిలినట్లయింది. పెదవులు తడుపుకున్నాడు. శోకం వల్ల కాంతివిహీనుడైనాడు.”