పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-163-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఘా! యుద్ధవ! నీకుఁ గృష్ణుఁ డసురేంద్రారాతి మన్నించి చె
ప్పి యధ్యాత్మ రహస్యతత్త్వ విమలాభిజ్ఞానసారంబు బో
నన్నుం గరుణించి చెప్పినఁ గృతార్థత్వంబునం బొందెదన్
విను పుణ్యాత్ములు శిష్యసంఘముల నుర్విం బ్రోవరే? వెండియున్.

టీకా:

అనఘా = పుణ్యాత్ముడా; ఉద్ధవా = ఉద్ధవుడా; నీకు = నీకు; కృష్ణుడు = కృష్ణుడు; అసురేంద్రారాతి = కృష్ణుడు {అసురేంద్రారాతి - రాక్షసులకు ఆరాతి (శత్రువు), కృష్ణుడు}; మన్నించి = గౌరవించి; చెప్పిన = చెప్పినట్టి; ఆధ్యాత్మ = ఆత్మవిద్యా; రహస్య = రహస్యమైన; తత్త్వ = తత్త్వము యొక్క; విమల = నిర్మలమైన; అభి = శ్రేష్ఠమైన; జ్ఞాన = జ్ఞానము యొక్క; సారము = సారమును; బోరన = శ్రీఘ్రముగ; నన్నున్ = నన్ను; కరుణించి = కరుణించి; చెప్పినన్ = చెప్పినచో; కృతార్థత్వంబున్ = ధన్యతను; పొందెదన్ = పొందెదను; విను = వినుము; పుణ్యాత్ములు = పుణ్యాత్ములు; శిష్య = శిష్యుల; సంఘములన్ = సమూహములను; ఉర్విన్ = భూమిమీద; ప్రోవరే = ఉద్ధరించరా; వెండియున్ = ఇంకనూ.

భావము:

“పరమ పావనుడవైన ఉద్ధవా! రాక్షసాంతకుడు అయిన కృష్ణుడు అత్యాదరంతో నీకు అనుగ్రహించిన ఆ అధ్యాత్మ తత్త్వ రహస్యాన్ని, అతి పవిత్రమైన అభిజ్ఞాన సారాన్ని అపార కృపాతిశయంతో ఇపుడే నాకు ఉపదేశించు. నా జన్మ సార్థకమౌతుంది. పుణ్యాత్ములైన గురువులు తమ శిష్యులను ధన్యాత్ములను చేస్తారు కదా.