పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-161-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుచున్నవాఁడ"నని ప
ల్కి పలుకుల కులికి కళవళించుచు విదురుం
నుపమశోకార్ణవమున
మునిఁగియు నిజయోగ సత్త్వమునఁ దరియించెన్.

టీకా:

చనుచున్ = వెళ్ళుతూ; ఉన్నవాడను = ఉన్నాను; అని = అని; పల్కిన = పలికిన; పలుకుల = మాటల; కున్ = కు; ఉలికి = ఉలిక్కిపడి; కళవళించుచున్ = కంగారుపడుతూ; విదురుండు = విదురుడు; అనుపమ = సాటిలేని; శోక = శోకము అను; ఆర్ణవమున = సముద్రమున; మునిగియున్ = మునిగినప్పటికిని; నిజ = తన; యోగ = యోగ; సత్త్వమునన్ = బలముచే; తరియించెన్ = దాటెను.

భావము:

నేను ఆ బదరికాశ్రమానికి వెళుతున్నాను” అని ఉద్ధవుడు చెప్పగానే ఆ పలుకులు విని అదిరిపడి కలతచెంది విదురుడు అపారమైన దుఃఖసాగరంలో మునిగిపోయాడు. మళ్ళీ తన యోగసాధనాబలంవల్ల సంప్రాప్తమైన సత్త్వబలంతో గుండె నిబ్బరించుకొని మామూలు స్థితికి వచ్చాడు.