పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-149-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంతరంబ హరి దన
హృయాబ్జము నందు ముకుళితేక్షణముల స
మ్మమునఁ జూచుచు నానత
నుండై యుండె ముదము ఱలఁగ ననఘా!

టీకా:

తదనంతరంబ = తరువాత; హరిన్ = కృష్ణుని {హరి – సర్వ సంచిత పాపములను హరించువాడు, విష్ణువు}; తన = తన; హృదయ = హృదయము అను; అబ్జము = పద్మము; అందు = లో; ముకుళిత = మూసిన; ఈక్షణములన్ = కన్నులలో; సమ్మదమునన్ = సంతోషముతో; చూచుచున్ = చూస్తూ; ఆనత = వంచిన; వదనుండు = శిరస్సు కలవాడు; ఐ = అయి; ఉండెన్ = ఉండెను; ముదము = సంతోషము; వఱలగన్ = అతిశయించగా; అనఘా = పుణ్యాత్ముడా.

భావము:

. ఓ పుణ్యాత్ముడా! విదురుడా! విను, అలా చూసి కన్నులు మూసుకున్నవాడైన మైత్రేయ మహర్షి తన హృదయకమలంలో పదిలపరచుకున్న ఆ భగవంతుణ్ణి సంతోషంతో సందర్శించుకుంటూ తలవంచుకొని నిలబడ్డాడు.