పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-126-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానితాఖిల జగన్మయ దేహమునఁ బొల్చు-
రణిదేవికిఁ బ్రియనయుఁ డైన
రకదానవుని సునాభాఖ్యఁ జెన్నొందు-
న చక్రధారా విఖండితోత్త
మాంగునిఁ జేయ నయ్యవనీలలామంబు-
వేఁడినఁ దత్పుత్రు విపులరాజ్య
దమున నిల్పి లోలి మందిరంబులఁ-
జిరముగ నరకుండు సెఱలఁ బెట్టి

3-126.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి కన్యలు నూఱుఁబదాఱువేలు
నార్తభాంధవుఁడైన పద్మాక్షుఁ జూచి
ర్షభాష్పాంబుధారా ప్రర్ష మొదవఁ
బంచశరబాణ నిర్భిన్నభావ లగుచు.

టీకా:

మానిత = గౌరవింపదగినదియై; అఖిల = సమస్తమైన; జగత్ = లోకములతో; మయ = కూడిన; దేహమునన్ = శరీరముతో; పొల్చు = ప్రకాశించు; ధరణీదేవి = భూదేవి; కిన్ = కి; ప్రియ = ఇష్టమైన; తనయుడు = పుత్రుడు; ఐన = అయినట్టి; నరక = నరకుడు అను; దానవునిన్ = రాక్షసుని; సునాభ = సునాభము అను; ఆఖ్యాతన్ = పేరుగన్నట్టి; చెన్నొందు = ప్రకాశించు; ఘన = గొప్ప; చక్ర = చక్రము యొక్క; ధారా = పదునుతో; విఖండిత = ఖండింపబడిన; ఉత్తమాంగునిన్ = శిరస్సు కలవానిని; చేయన్ = చేయగా; ఆ = ఆ; అవనీ = భూ; లలామంబు = దేవి; వేడినన్ = కోరగా; తత్ = అతని; పుత్రున్ = కోడుకును; విపుల = విస్తారమైన; రాజ్య = రాజ్య; పదమున = అధికారమున; నిల్పి = ఉంచి; లోపలిమందిరంబులన్ = అంతఃపురమున; చిరముగన్ = చాలాకాలముగ; నరకుండు = నరకుడు; చెఱలన్ = చెరసాలలో; పెట్టిన = బంధించిన; అట్టి = అటువంటి;
కన్యలు = స్త్రీలు; నూఱుబదాఱువేలున్ = పదహారువేలఒకవందమందిని (16100); ఆర్త = ఆర్తులను, దుఃఖితులను; బాంధవుడు = కాపాడువాడు; ఐన = అయినట్టి; పద్మాక్షున్ = కృష్ణుని {పద్మాక్షుడు - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు}; చూచి = చూసి; హర్ష = ఆనందపు; బాష్పాంబు = కన్నీటి; ధారా = ధారలు అను; ప్రవర్షము = పెద్దవర్షము; ఒదవన్ = కలుగగా; పంచశర = మన్మథుని {పంచశర - ఐదు బాణముల వాడు, మన్మథుడు}; బాణ = బాణములచే; నిర్భిన్నలు = బాగాగాయపడినవారు; అగుచున్ = అవుతూ.

భావము:

సమస్త జీవులకు అంతర్లీనమైన రూపం ధరించి గౌరవాన్ని అందుకొనే భూదేవికి ప్రియమైన కుమారుడు నరకుడు. అయినా వాడు రాక్షస లక్షణాలు కలవాడు కావడంతో శ్రీకృష్ణుడు “సునాభము” అనే పేరుగల చక్రము అంచుతో అతని శిరస్సును ఖండించాడు. అనంతరం ధరణీమాత ప్రార్థించగా అతని కుమారుణ్ణి ఆ విశాల సామ్రాజ్యానికి అధిపతిగా చేసాడు. ఆ నరకాసురుని అంతఃపురంలోని చెరసాలలో చిరకాలంగా మ్రగ్గుతున్న పదహారువేల నూరుగురు కన్యలూ ఆర్తజన రక్షకుడైన కృష్ణుని వీక్షించి, అనురాగయుక్తులౌతూ ప్రమోదబాష్పాలు వర్షించారు.