పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-115-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱి మంద గొందలము నందఁగ వల్లవు లెల్లఁ "గృష్ణ! యీ
చేనులెల్ల నిట్టి జడిఁ జిందఱవందఱలై కలంగుచుం
గారు లైరి నీవు గృపఁ గావుము; కావు మనాథనాథ! ని
ర్థూకళంక! భక్తిపరితోషణభూషణ! పాపశోషణా!"

టీకా:

ఆ = ఆ; తఱి = సమయమున; మంద = గొల్లపల్లె; కొందలమున్ = చీకాకును; అందగన్ = పొందగా; వల్లవులు = గోపాలురు; ఎల్లన్ = అందరును; కృష్ణ = కృష్ణా; ఈ = ఈ; చేతనులు = జీవులు; ఎల్లన్ = అందరూ; ఇట్టి = ఇటువంటి; జడిన్ = వర్షపుజడికి; చిందఱవందఱలు = చెల్లాచెదురు; ఐ = అయి; కలంగుచున్ = కలతపడుతూ; కాతరులు = భయభ్రాంతులు; ఐరి = అయిరి; నీవు = నీవు; కృపన్ = దయతో; కావుము = కాపాడుము; కావుము = కాపాడు; అనాథనాధ = దిక్కులేనివారికి దిక్కైనవాడా; నిర్ధూత = విడువ బడిన, ఎగురగొట్టబడిన; కళంక = పాపములు కలవాడ; భక్త = భక్తులను; పరితోషణ = సంతోషపెట్టుట అను; భూషణ = అలంకారములు కలవాడ; పాప = పాపములను; శోషణ = నశింపజేయువాడ.

భావము:

అప్పుడు వ్రేపల్లెలోని గోపాలురూ, గోవులూ అందరూ ఆ వర్షానికి అల్లకల్లోలమయ్యారు. గొల్లలంతా తల్లడిల్లి ఒక చోట చేరారు. “కృష్ణా! రక్షించు! రక్షించు! ఈ జడివాన ధాటికి గోకులంలోని సకల జీవులూ చీకాకుపడి చిందరవందరలు అవుతున్నారు. దిక్కులేని వారికి నీవే దిక్కు. సజ్జనులను పోషించేవాడవూ దుర్జనులను శిక్షించేవాడవూ నిష్కళంకుడవూ అయిన కృష్ణా! దయతో కాపాడవయ్యా.”