పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-113-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివిజాధీశుగుఱించి వానకొఱకై దీపింప నందాది వ
ల్లవు లేటేఁట ననూనసంపదల నుల్లాసంబునం జేయు ను
త్సముం గృష్ణుఁడు మాన్పి గోపగణముల్ సంప్రీతినొందన్ శచీ
వు గర్వం బడఁపంగ నవ్యయముగాఁ దాఁ జేసె గోయాగమున్.

టీకా:

దివిజాధీశున్ = ఇంద్రుని {దివిజాధీశుడు - దివిజుల (దేవతల)కు అధీశుడు (ప్రభువు), ఇఁద్రుడు}; గుఱించి = ఉద్ధేశించి; వాన = వాన; కొఱకై = కోసము; దీపింపన్ = అతిశయించునట్లు; నంద = నందుడు; ఆది = మొదలైన; వల్లవులు = గోపాలురు; ఏటేటన్ = ప్రతిసంవత్సరము; అనూన = వెలితిలేని; సంపదలన్ = సంపదలకై; ఉల్లాసంబునన్ = ఉల్లాసముతో; చేయున్ = చేసెడి; ఉత్సవమున్ = పండుగను; కృష్ణుడు = కృష్ణుడు; మాన్పి = మాన్పించి; గోప = గోపాలుర; గణముల్ = సమూహములు; సంప్రీతిన్ = సంతోషమును; ఒందగన్ = పొందగన్; శచీధవు = ఇంద్రుని {శచీధవుడు - శచీదేవి భర్త, ఇంద్రుడు}; గర్వం = గర్వము; అడపంగన్ = అణచుటకు; అవ్యయముగన్ = శుభకరముగ; తాన్ = తాను; చేసెన్ = చేసెను; గోయాగమున్ = గోయాగమును.

భావము:

నందుడు మొదలైన యాదవులు వర్షం బాగా కురియటంకోసం ఇంద్రుణ్ణి గూర్చి ఒక ఉత్సవం ఎంతో వైభవంతో, ఎంతో ఉత్సాహంతో ఏటేటా గొప్పగా చేసేవారు. కృష్ణుడు, ఆ ఇంద్రోత్సవాన్ని మాన్పించి ఇంద్రుని అహంకారం అడుగంటేలాగా, గోపాలురు అందరూ సంతోషించేలాగా గోపూజ ప్రధానమైన గోయాగాన్ని తక్కువ వ్యయంతో, ఎక్కువ వైభవంతో జరిపించాడు.