పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-111-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చికేళీరతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులం
మొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునం
రుణాతీతులఁ గామరూపు లగు నక్కంసప్రయుక్తక్షపా
రులం గృష్ణుఁడు సంగరస్థలములం క్కాడె లీలాగతిన్.

టీకా:

చిర = మిక్కిలి; కేళీ = ఆడుకొనే; రతిన్ = ఆసక్తితో; బాలకుల్ = పిల్లలు; తృణములన్ = గడ్డిపోచలను; సింహ = సింహము; ఆది = మొదలైన; రూపములన్ = రూపములతో; కరము = చాలా; ఒప్పన్ = చక్కగా; విరచించి = తయారుచేసి; వానిన్ = వాటిని; మరలన్ = మళ్ళా; ఖండించు = ముక్కలుచేయు; చందంబునన్ = విధముగ; కరుణా = దయ; అతీతులన్ = లేనివారిని; కామరూపులన్ = కోరిన రూపు ధరించ గలవారిని; ఆ = ఆ; కంస = కంసునిచే; ప్రయుక్త = ప్రయోగింపబడిన; క్షపాచరులన్ = రాక్షసులను {క్షపాచరులు - రాత్రి తిరుగువారు, రాక్షసులు}; కృష్ణుడు = కృష్ణుడు; సంగర = యుద్ధ; స్థలములన్ = భూములలో; చక్కాడెన్ = చెండాడెను, సంహరించెను; లీలా = లీల; గతిన్ = వలె.

భావము:

ఆడుకోటానికి చిన్న పిల్లలు గడ్డితో సింహం మొదలైన బొమ్మల్ని తయారు చేస్తారు. ఆట పూర్తి కాగానే వాటిని మళ్లీ చించి, తుంచి పారేస్తారు. అలానే దయమాలిన వారూ, కామరూపధారులూ, కంసుని చారులూ అయిన రాక్షస వీరుల్ని ఎందరినో గోవిందుడు కదన రంగంలో అవలీలగా చించి చెండాడాడు.