పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-108-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యమునానదీ సలిల ర్ధిత సౌరభ యుక్త పుష్ప మే
దు మకరంద పానపరితుష్ట మధువ్రతయూధ మాధవీ
కువక కుంద చందన నికుంజము లందు మయూర శారికా
భృత రాజకీర మృదుభాషల భంగిఁ జెలంగి పల్కుచున్.

టీకా:

వర = శ్రేష్ఠమైన; యమునా = యమున అను; నదీ = నది యొక్క; సలిల = నీటితో; వర్ధిత = పెంచబడిన; సౌరభ = పరమళముతో; యుక్త = కూడిన; పుష్ప = పూవులలోని; మేదుర = చిక్కని; మకరంద = తేనె; పాన = తాగుటచే; పరి = చక్కగా; పరితుష్ట = సంతృప్తి చెందిన; మధువ్రత = తేనెటీగల; యూధ = సమూహములు కల; మాధవీ = మాధవీ లత; కురవక = ఎఱ్ఱగోరింట; కుంద = మల్లెచెట్లు; చందన = మంచిగంధపుచెట్లు; నికుంజముల = పొదల; అందున్ = లో; మయూర = నెమళ్ళు; శారిక = గోరువంకలు; పరభృత = కోకిలలు; రాజకీర = రామచిలుకలు; మృదు = మెత్తని; భాషల = పలుకుల; భంగిన్ = వలె; చెలంగి = చెలరేగి; పల్కుచున్ = పలుకుతూ.

భావము:

ఆ గోపాల బాలుడు నిర్మలమైన యమునా నదీ జలాలతో పెద్దగా పెరిగి ఘుమఘుమలాడే సువాసనలు గల పూలనుండి చిందుతున్న మకరందాన్ని కడుపు నిండా త్రాగి మైమరచిన తుమ్మెదల గుంపులతో కూడిన మాధవీ మంటపాలలో, గోరింట గుబురులులో, మొల్ల పొదలలో, మంచి గంధపు నికుంజాలలో దూరి నెమలిలాగా కేకలు వేస్తూ, గోరువంకలాగా కూతలు కూస్తూ కోకిలలాగా రాగాలు తీస్తూ రామచిలకలలాగా రమణీయ పలుకులు పలుకుతూ ఉండేవాడు.