పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-103-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణిభరంబు వాపుటకుఁ దామరసాసను ప్రార్థనన్ రమా
రుఁ డల కంస బంధననివాసమునన్ వసుదేవదేవకీ
రులకు నుద్భవింప బలవంతుఁడు గంసుఁడు హింససేయు న
న్వెపున నర్థరాత్రి సుతునిం గొని యవ్వసుదేవుఁ డిమ్ములన్.

టీకా:

ధరణీ = భూమి యొక్క; భరమున్ = భారమును; వాపుటకున్ = తగ్గించుటకు; తామరసాసను = బ్రహ్మదేవుని {తామరసాసనుడు - పద్మమున ఆసీనుడై ఉండువాడు}; ప్రార్థనన్ = వేడికోలు వలన; రమావరుడు = కృష్ణుడు {రమావరుడు - రమ (లక్ష్మీ దేవి) భర్త, విష్ణువు}; అలన్ = అక్కడ; కంస = కంసునిచే; బంధననివాసమునన్ = చెరసాల యందున్న; వసుదేవ = వసుదేవుడు; దేవకీ = దేవకీదేవి అను; వరుల్ = శ్రేష్ఠుల; కున్ = కు; ఉద్భవింప = పుట్టగా; బలవంతుడు = బలవంతుడైన; కంసుడు = కంసుడు; హింససేయునన్ = సంహరించునని; వెఱపునన్ = భయముతో; అర్థరాత్రి = అర్థరాత్రి; సుతునుం = పుత్రుని; కొని = తీసుకొని; ఆ = ఆ; వసుదేవుడు = వసుదేవుడు; ఇమ్ములన్ = ఉపాయముగ.

భావము:

పుట్టుక ఎరుగని ఆ లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు భూభారాన్ని పోగొట్టడానికి, తన నాభి కమలంలో పుట్టిన బ్రహ్మదేవుని ప్రార్థన మన్నించాడు. అలా కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు పుత్రుడై పుట్టాడు. వసుదేవుడికి తన ముద్దుల కుమారుణ్ణి అతి బలవంతుడైన కంసుడు హింసిస్తాడేమో అనే భయం కలిగింది, వెంటనే వసుదేవుడు ఆ అర్థరాత్రి పసివాణ్ణి తీసుకుని బయలుదేరాడు.