పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-101-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నుజానీక మనేక వారములు దోర్దర్పంబు సంధిల్లఁగా
వినుతాసూను భుజావరోహుఁ డగు నవ్విష్ణున్ సునాభాస్త్రుఁ దా
నిలో మార్కొని పోకు పోకు హరి దైత్యారాతి! యంచుం దదా
ముం జూచుచుఁ గూలి మోక్షపదముం ప్రాపింతు రత్యున్నతిన్.

టీకా:

దనుజ = రాక్షసుల; అనీకము = సేనలు; అనేక = పెక్కు; వారములు = మారులు; దోర్దర్పంబున్ = భుజగర్వము; సంధిల్లగా = ప్రాప్తించగా; వినుతాసూను = గరుత్మంతుని {వినుతాసూనుడు - వినుత యొక్క పుత్రుడు, గరుత్మంతుడు}; భుజ = భుజములను; ఆరోహుడు = ఎక్కువాడు; అగు = అయిన; ఆ = ఆ; విష్ణునిన్ = విష్ణువును; సునాభాస్త్రున్ = విష్ణుని {సునాభాస్త్రుడు - సునాభము(అను చక్రము) ఆయుధముగా గలవాడు, విష్ణవు}; తారు = తాము; అని = యుద్ధము; లోన్ = లో; మార్కొని = ఎదుర్కొని; పోకు = వెళ్ళిపోకు; పోకు = వెళ్ళిపోకు; హరి = హరీ; దైత్యారాతి = రాక్షసులకు శత్రువా; అంచుం = అనుచు; తత్ = ఆ; ఆననమున్ = ముఖమును; చూచుచున్ = చూస్తూ; కూలి = చనిపోయి; మోక్ష = మోక్ష; పదమున్ = స్థితిని; ప్రాపింతురు = పొందుదురు; అతి = మిక్కిలి; ఉన్నతిన్ = ఉన్నతస్థితిని.

భావము:

“గరుడుని భుజం ఎక్కువాడూ, సుదర్శన చక్రం ధరించువాడూ అయిన శ్రీమహావిష్ణువును ఎందరో రాక్షసులు ఎన్నో పర్యాయాలు అవక్ర భుజపరాక్రమంతో యుద్ధాలలో ఎదుర్కొన్నారు. “ఓరీ! హరీ! అసురవైరీ! ఆగు పారిపోకు నిలు” అని ఆయన నామాన్నే పలుకుతూ, ఆయన ముఖాన్నే చూస్తూ రణరంగంలో నేలగూలిన ఆ రాక్షసులు మోక్ష సామ్రాజ్యాన్ని అందుకొని అత్యున్నతమైన స్థానాన్ని పొందారు.