పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిరణ్యకశిప హిరణ్యాక్షుల జన్మ

  •  
  •  
  •  

3-611-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దితి జఠరంబు నందుఁ దన తేజము మున్నిడి నట్టి పుత్రు న
ద్భు చరితున్ "హిరణ్యకశిపుం" డను పేరఁ బ్రసూతివేళ నా
దితి మును గన్న పట్టి రవితేజునిఁ "గాంచనలోచనుండు" నా
హిమతిఁ బేరువెట్టి చనియెన్ నిజ నిర్మల పుణ్యభూమికిన్.

టీకా:

దితి = దితి యొక్క; జఠరంబునన్ = కడుపు; అందు = లో; తన = తన యొక్క; తేజమున్ = తేజస్సును; మున్ను = ముందుగా; ఇడి = పెట్టిన; అట్టి = అటువంటి; పుత్రున్ = కొడుకుని; అద్భుత = అద్భుతమైన; చరితున్ = చరిత్ర కలవానిని; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; అను = అనెడి; పేరన్ = పేరును; ప్రసూతి = పురిటి; వేళన్ = సమయమున; ఆ = ఆ; దితి = దితి; మును = ముందుగ; కన్న = కనినట్టి; పట్టి = పిల్లవానిని; రవి = సూర్యునితో సమానమైన; తేజునిన్ = తేజస్సు కలవానిని; కాంచనలోచనుండు = హిరణ్యాక్షుడు {కాంచనలోచనుడు - బంగారము వంటి కన్నులు ఉన్నవాడు, హిరణ్యాక్షుడు}; నాన్ = అని; హితమతి = మంచికోరు మనసు కలవాడు; పేరు = పేరును; పెట్టి = పెట్టి; చనియెన్ = వెళ్లెను; నిజ = తన; నిర్మల = స్వచ్ఛమైన; పుణ్య = పుణ్యవంతమైన; భూమికిన్ = స్థలమునకు.

భావము:

దితి గర్భంలో తాను మొదట పెట్టినట్టి తేజస్సువల్ల పుట్టి అద్భుతంగా వెలిగేవానికి ‘హిరణ్యకశిపుడు’ అనీ, కానుపు సమయంలో దితికి మొదటగా పుట్టి సూర్యతేజస్సుతో వెలిగేవానికి ‘హిరణ్యాక్షుడు’ అని మంచి మనస్సుతో పేర్లు పెట్టి కశ్యపుడు తన ప్రవిత్రమైన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.