పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిరణ్యకశిప హిరణ్యాక్షుల జన్మ

  •  
  •  
  •  

3-610-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉన్న సమయంబునం గశ్యపుండు నిజ తనూభవులఁ జూడం దలంచి దితిమందిరంబునకుం జనుదెంచి; సుతులం గనుంగొని; వారలకు నామకరణంబు సేయం దలంచి.

టీకా:

ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయములో; కశ్యపుండు = కశ్యపుడు; నిజ = తన; తనూభవులన్ = పుత్రులను; చూడన్ = చూడవలెనని; తలంచి = అనుకొని; దితి = దితి యొక్క; మందిరమున్ = నివాసముల; కున్ = కు; చనుదెంచి = వచ్చి; సుతులన్ = పుత్రులను; కనుంగొని = చూసి; వారల = వారి; కున్ = కి; నామకరణంబున్ = పేర్లుపెట్టుటలు; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని.

భావము:

ఉన్న సమయంలో కశ్యపుడు తన కుమారులను చూడాలనుకొని దితి మందిరానికి వచ్చి పుత్రులను చూచి, వారికి నామకరణం చేయాలనుకొని....