పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల వైకుంఠ గమనంబు

  •  
  •  
  •  

3-504-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిచని కాంచిరంత బుధత్తము లంచిత నిత్య దివ్యశో
విభవాభిరామముఁ బ్రన్నజనస్తవనీయ నామమున్
న విరామమున్ సుజన న్నుత భూమము భక్తలోకపా
గుణధామముం బురలలామముఁ జారువికుంఠధామమున్.

టీకా:

చనిచని = బయలుదేరి వెళ్లి; కాంచిరి = దర్శించిరి; అంతన్ = అంతట; బుధ = జ్ఞానులలో; సత్తములు = శ్రేష్ఠులు; అంచిత = పూజనీయమును; నిత్య = శాశ్వతమును; దివ్య = దివ్యమును; శోభన = ప్రకాశించుచున్నదియు నైన; విభవ = వైభవముతో; అభిరామమున్ = ఒప్పుతున్నదియును; ప్రపన్న = శరాణాగతులకు; స్తవనీయ = స్తుతింపదగిన; నామమున్ = పేరు కలదియును; జనన = జన్మబంధముల; విరామమున్ = ఛేదించునదియును; సు = మంచి; జన = జనులచే; సన్నుతన్ = స్తుతింపబడిన; భూమము = స్థానమును; భక్త = భక్తులు; లోక = అందరను; పాలన = పరిపాలించు; గుణ = గుణములు కల; ధామమున్ = ప్రదేశమును; పుర = నగరములలో; లలామమున్ = శ్రేష్ఠభూషణమైనదియును అయిన; చారు = అందమైన; వికుంఠ = వైకుంఠ; ధామమున్ = పురమును;

భావము:

జ్ఞానులలో శ్రేష్ఠులైన ఆ సనక సనందనాదులు అలా వెళ్ళి వెళ్ళి శ్రేష్ఠమైన వైకుంఠ నగరాన్ని చూసారు. అది దివ్యమైన శోభతో నిత్యమూ దేదీప్యమానంగా మనోహరంగా ఉంటుంది. శరణుకోరే భక్తులు దాని పేరును స్తుతిస్తారు. అది జన్మబంధాలను ఛేదిస్తుంది; సజ్జనులచేత పొగడ బడుతుంది; భక్త జనులను పాలించే గుణాలకు ఆలవాలమైనట్టిది.