పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ మానస సర్గంబు

  •  
  •  
  •  

3-341-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మరె భువనంబు లతని కాలాఖ్యతయును
ణుతిసేయు తదీయ లక్షణము లర్థి
నాకు నెఱిఁగింపు మయ్య వివేచరిత!"
నిన మైత్రేయుఁ డవ్విదురుకు ననియె.

టీకా:

అమరెన్ = అమరినవి; భువనంబులు = లోకములు; అతని = అతనిచే సృష్టంపబడిన; కాల = కాలము యొక్క; ఆఖ్యాతయును = స్వభావమును; గణుతిసేయ = లెక్కించు విధానము; తదీయ = దాని; లక్షణముల్ = లక్షణములు; అర్థిన్ = కోరి; నాకున్ = నాకు; ఎఱిగింపుము = తెలుపుము; అయ్య = తండ్రి; వివేకచరిత = వివేకముతో వర్తించువాడ; అనిన = అనగా; మైత్రేయుడు = మైత్రేయుడు; ఆ = ఆ; విదురున్ = విదురుని; కున్ = కి; అనియెన్ = చెప్పెను.

భావము:

వివేకవంతుడవు అయిన మైత్రేయా! ఆ మహావిష్ణువు మహిమ వలననే కదా ఈ లోకాలన్నీ విలసిల్లాయి. అట్టి పరమాత్మ యొక్క కాలస్వరూపాన్నీ, దానిని గణించే విధానాన్ని, దాని లక్షణాలను నాకు విశదీకరించు” అని అడిగాడు. అప్పుడు విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు.