తృతీయ స్కంధము : బ్రహ్మ మానస సర్గంబు
- ఉపకరణాలు:
అమరె భువనంబు లతని కాలాఖ్యతయును
గణుతిసేయు తదీయ లక్షణము లర్థి
నాకు నెఱిఁగింపు మయ్య వివేకచరిత!"
యనిన మైత్రేయుఁ డవ్విదురునకు ననియె.
టీకా:
అమరెన్ = అమరినవి; భువనంబులు = లోకములు; అతని = అతనిచే సృష్టంపబడిన; కాల = కాలము యొక్క; ఆఖ్యాతయును = స్వభావమును; గణుతిసేయ = లెక్కించు విధానము; తదీయ = దాని; లక్షణముల్ = లక్షణములు; అర్థిన్ = కోరి; నాకున్ = నాకు; ఎఱిగింపుము = తెలుపుము; అయ్య = తండ్రి; వివేకచరిత = వివేకముతో వర్తించువాడ; అనిన = అనగా; మైత్రేయుడు = మైత్రేయుడు; ఆ = ఆ; విదురున్ = విదురుని; కున్ = కి; అనియెన్ = చెప్పెను.
భావము:
వివేకవంతుడవు అయిన మైత్రేయా! ఆ మహావిష్ణువు మహిమ వలననే కదా ఈ లోకాలన్నీ విలసిల్లాయి. అట్టి పరమాత్మ యొక్క కాలస్వరూపాన్నీ, దానిని గణించే విధానాన్ని, దాని లక్షణాలను నాకు విశదీకరించు” అని అడిగాడు. అప్పుడు విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు.