పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ మానస సర్గంబు

  •  
  •  
  •  

3-340-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విదురుఁడు దురితావనిభృ
ద్భిదురుఁడు మునివరునిఁ జూచి ప్రియము మనమునం
దురఁగ నిట్లని పలికె "న
తి దురంతం బయిన విష్ణుదేవుని మహిమన్.

టీకా:

విదురుడు = విదురుడు; దురిత = పాపములు అను; అవనీభృత్ = పర్వతములను; భిదురుడు = భేదించు, వజ్రాయుధము వంటివాడు; ముని = మునులలో; వరులలో = శ్రేష్ఠుని; చూచి = చూసి; ప్రియము = ప్రేమ; మనమునన్ = మనసులో; కదురగన్ = కలుగగ; ఇట్లు = ఈ విధముగా; అని = అని; పలికెన్ = పలికెను; అతి = మిక్కిలి; దురంతంబున్ = అంతము లేనివి; అయిన = అయిన; విష్ణు = విష్ణువు అను; దేవుని = దేవుడి; మహిమన్ = మహిమతో.

భావము:

విదురుడు కొండలంతగా పేరుకుపోయిన పాపాలను అయినా వజ్రాయుధంలా ఖండించగల వాడు. అప్పుడు, ఆ విదురుడు హృదయంలో పొంగిపొరలే సంతోషంతో మైత్రేయుణ్ణి చూసి మెల్లగా ఇలా అన్నాడు “అంతుచిక్కనిది కదా మహావిష్ణువు మహిమ.