పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ మానస సర్గంబు

  •  
  •  
  •  

3-332-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చెప్పిన మైత్రేయునిఁ
నుఁగొని విదురుండు పలికెఁ డు ముదమొప్పన్
"జనుత! నలినదళాక్షుఁడు
నినం బద్మజుఁడు దేహసంబంధమునన్.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; మైత్రేయునిన్ = మైత్రేయుడిని; కనుగొని = చూసి; విదురుండు = విదురుడు; పలికెన్ = పలికెను; కడు = మిక్కిలి; ముదము = సంతోషము; ఒప్పన్ = ఒప్పునట్లు; జననుత = జనులచే కీర్తింపబడువాడ; నలినదళాక్షుడు = విష్ణుమూర్తి {నలినదళాక్షుడు - నలినము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; చనినన్ = వెళ్ళిన పిమ్మట; పద్మజుడు = బ్రహ్మదేవుడు {పద్మజుడు - పద్మమున పుట్టినవాడు}; దేహ = శరీరములకు; సంబంధమున్ = సంబంధించినదియును.

భావము:

ఇలా చెప్పిన మైత్రేయుడితో విదురుడు ఎంతో సంతోషంగా ఇలా చెప్పసాగాడు. “మైత్రేయా! నీవు సర్వ మానవజాతికి వందనీయుడవు. విష్ణువు అంతర్థానమైన అనంతరం బ్రహ్మదేవుడు దేహ సంబంధంతో ఎలా సృష్టి నడిపాడు.