పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-314-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుహసంజాతుఁడు నె
మ్మమున హర్షించె ననుచు" మైత్రేయమహా
ముని ఘనుఁడగు విదురునకున్
వియంబున నెఱుఁగజెప్పి వెండియుఁ బలికెన్.

టీకా:

వనరుహసంజాతుడు = బ్రహ్మదేవుడు {వనరుహసంజాతుడు- వనరుహము (నీట పుట్టిన, పద్మము) నందు చక్కగా పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; నెఱ = నిండు; మనమ్మునన్ = మనసుతో; హర్షించెన్ = సంతోషించెను; అనుచున్ = అనుచూ; మైత్రేయ = మైత్రేయుడు అను; మహా = గొప్ప; ముని = ముని; ఘనుడు = గొప్పవాడు; అగు = అయిన; విదురున = విదురుని; కున్ = కి; వినయంబునన్ = వినమ్రతగా; ఎఱుగన్ = తెలియునట్లు; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; పలికెన్ = పలికెను.

భావము:

ఇలా మ్రొక్కిన బ్రహ్మదేవుని నిండుమనసు ఆనందంతో పొంగిపోయింది.” అని మైత్రేయ మహర్షి విజ్ఞానధనుడైన విదురునకు వివరంగా తెలియ చెప్పి, మళ్ళీ ఇలా అన్నాడు.