పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మకు హరి ప్రత్యక్ష మగుట

  •  
  •  
  •  

3-286-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘు ఫణాతపత్రనిచయాగ్ర సమంచిత నూత్నరత్న ని
ర్మరుచిచే యుగాంత తిమిరంబు నడంచి యకల్మషోల్లస
జ్జములఁ జేసి యందు నవసారసనాళసితైకభోగముం
లిగిన శేషతల్పమునుఁ గైకొని యున్న మహాత్ము నొక్కనిన్.

టీకా:

అలఘు = గొప్పదైన; ఫణా = పడగలు అను; అతపత్ర = గొడుగుల; నిచయ = సమూహముల; అగ్ర = పైన; సమంచిత = చక్కగా నొప్పతున్న; నూత్న = సరికొత్త; రత్న = రత్నముల యొక్క; నిర్మల = పరిశుభ్రమైన; రుచి = కాంతి; చేన్ = చేత; యుగ = యుగముల; అంత = అంత మందలి; తిమిరంబున్ = చీకటిని; అడంచి = అణచి; అకల్మష = నిర్మలముగా; ఉల్లసత్ = ప్రకాశిస్తున్న; జలములన్ = నీరు; చేసి = ఏర్పరచి; అందున్ = దానిలో; నవ = లేత; సారస = పద్మముల; నాళ = కాడల; సిత = తెలుపు; ఏక = వంటి; భోగమున్ = శరీరము; కలిగిన = కల; శేష = శేషుడు అను; తల్పమునున్ = శయన తల్పమును; కైకొని = గ్రహించి; ఉన్న = ఉన్నట్టి; మహాత్యునిన్ = గొప్పవానిని; ఒక్కనిన్ = ఒకనిన్.

భావము:

అంతేకాదు. ఆ మహానుభావుడు గొప్పవైన పడగలనే గొడుగుల చివర గల స్వచ్ఛమైన రత్నాల కాంతులతో ప్రళయకాలంలోని చీకట్లను పోకార్చుతూ కొంగ్రొత్త తామరతూడులాంటి తెల్లని దేహసంపద కలిగన ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసికొని మిక్కిలి నిర్మలంగా ఉన్న నీళ్ళమధ్యలో శయనించి ఉన్నాడు.