పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-261-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని విదురుఁడు మైత్రేయుని
వియంబునఁ దెలియ నడుగు విధ మెల్లను వ్యా
సునిసుతుఁ డభిమన్యునినం
నున కెఱింగించి మఱియుఁ గ నిట్లనియెన్.

టీకా:

అని = అని; విదురుడు = విదురుడు; మైత్రేయుని = మైత్రేయుని; వినయంబునన్ = వినయముగా; తెలియన్ = తెలుపమని; అడుగు = అడిగిన; విధమున్ = విధానము; ఎల్లన్ = అంతయు; వ్యాసుని = వేదవ్యాసుని {వ్యాసుని సుతుడు - శుకమహర్షి}; సుతుడు = పుత్రుడు; అభిమన్యుని = అభిమన్యుని {అభిమన్యు నందనుడు - పరీక్షిత్తు}; నందనుని = పుత్రున; కిన్ = కిని; ఎఱిగించి = తెలిపి; మఱియున్ = మరల; తగన్ = చక్కగా; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని వినయంగా విదురుడు మైత్రేయుణ్ణి అడిగినట్లు శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పి మళ్లీ ఇట్లా అన్నాడు.